కొండపై బస్టాండ్ కబ్జా?!!
- బస్టాండ్లో వాహనల పార్కింగ్
- ప్లాట్ ఫామ్ లపై దుకాణాలు
- నిలిచే చోటు లేక భక్తుల తీవ్ర ఇబ్బందులు
గత ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణం లో గుట్ట కు వచ్చే భక్తుల సౌకర్యం కోసం, చాలా దూర దృష్టితో 20 ఫ్లాట్ ఫామ్ లతో ఇరువైపుల విశాలమైన పెద్ద బస్టాండ్ ను నిర్మించారు. జిల్లా కేంద్రాల నుంచి, హైదరాబాద్ నుంచి నేరుగా కొండపైకి బస్సులను కూడా నడపాలనేది అప్పటి ప్లాను. కొండ క్రింద బస చేసే భక్తులకు ప్రత్యేకంగా ఒక ఆర్టీసీ బస్టాండ్, కొండ పైకి వచ్చే బస్సులకోసం మరో దేవస్థాన బస్టాండ్ కొండ క్రింద ఏర్పాటు చేశారు. వాహనల పార్కింగ్ మొత్తం కొండ క్రిందనే ఏర్పాటు చేసి, ఉచిత బస్సుల ద్వారా కొండ మీదికి భక్తులు వచ్చేలా, వివిద రకాల బుకింగ్ లు కూడా కొండ క్రిందనే సెంట్రల్ బుకింగ్ ఆఫీసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వివిధ కారణాలతో ఇవి కార్యరూపం దాల్చిన, ముందుకు సాగలేదు, దీనికి తోడు, కొండ క్రింద దేవస్థానం బస్టాండ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, మహా పార్కింగ్ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కొండ మీదికి వాహనాలను నియత్రించాలనే చాణక్య నీతితో కొండపై పార్కింగ్ ధర 500/- చేసిన, సరిపోను బస్సులు లేకపోవడం, వేచి ఉండవలసిన సమయం ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో వాహన దారులు 500/- చెల్లించి కొండపైకి రావడానికే ఇస్టపడుతున్నారు. దీనితో కొండపైన స్థలం సరిపడక బస్టాండ్ ప్లాట్ ఫామ్ లపై పార్క్ చేస్తున్నారు, దానికి అధికారులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు, 500/- వసూలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వారికి పార్కింగ్ స్థలం చూపెట్టాల్సిందే. అందుకే అధికారులు చూసి చూడనట్టు వదిలివేస్తున్నారు.
బ్యాగులు భద్రపరిచే గది ఎక్కడ, మొబైలు భద్రపరిచే స్థలం ఎక్కడ, చెప్పులు పెట్టె స్థలం ఎక్కడ, దేనికి నిర్దిష్టమైన స్థలం కేటాయించలేదు, కానీ టెండర్లు పిలిచి డబ్బు సంపాదన ఆలోచన తో, ప్రయాణికులు సేద తీరే బస్టాండ్ లోనే వీరందరికి స్థలం కేటాయించారు. మరో వైపు పాత దుకాణ దారులకు కూడ బస్టాండ్ ప్లాట్ ఫామ్ లై పైనే స్థలాలు కేటాయించడంతో ప్రస్తుతం భక్తులు, ప్రయాణికులు నిలోచినికి కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. వృద్దులు, పిల్ల తల్లులు, ఇతతర భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలిసి ఎస్పీఫ్ ఆఫీసు, ప్రాధమిక చికిత్స కేంద్రం సైతం ఫ్లాట్ ఫామ్ పైనే ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇప్పుడెలా?
వీటన్నిటికీ శాశ్వత పరిష్కరం కావలంటే, ముందుగా కొన్ని పెండిగ్లో ఉన్న పనులు పూర్తి కావాలి, ముఖ్యంగా కొండ క్రింద ఏర్పాటు చేస్తున్న మహా పార్కింగ్, దేవస్తానం బస్టాండ్ పూర్తి అయ్యి, భక్తులకు సరి పడ బస్సులు వేస్తే కొండ మీదికి వాహన దారులు తమ స్వంత వాహనాలలో రావలనుకోరు. అలాగే కొండ వెనుక వాహనాలు పార్కింగ్ చేసిన తరువాత వారు బస్సు ద్వారా తప్పితే వేరే విధంగా కొండ పైకి చేరే అవకాశం లేదు, లేదంటే మళ్ళీ ఆటోలో ఎక్కువ డబ్బులు ఇచ్చి రావాల్సి వస్తుంది, అంతకటే 500/- చెల్లించి కొండ మీదికి రావలని అనుకునే వారే ఎక్కువ, కొండ వెనుక వైపు కూడా ఒక మెట్ల దారి వ్రత మండపం ప్రక్కనుంచి ఉంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు, అప్పుడు బస్సులకోసం ఎదురు చూడకుండా భక్తులు లు ఎప్పుడైన వచ్చి వెళ్ళే సౌలభ్యం ఉంటుంది. కొంతవరకైనా ఈ పార్కింగ్, బస్సుల సమస్య తీరుతుందని స్థానికులు అనుకుంటున్నారు.
కొసమెరుపు :
రోజు లక్షల రూపాయాలలో వసూలు అవుతున్న పార్కింగ్ డబ్బుల తోనే, నెల నెల దేవస్థానం ఆర్టీసీ కి డబ్బులు చెల్లిస్తుందని, అందుకే ఈ సమస్య పరిష్కారాన్ని అంతా ప్రాముఖ్యతగా తీసుకోవడం లేదని స్థానికంగా ఒక భావన నెలకొంది. అధికారులు ఈ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునెల, భక్తుల ఇలవేల్పు ఆ నరసింహ స్వామి వారే వారికి ఆలోచన, ఆదాయం, దైర్యం ఇవ్వాలన్నీ భక్తులు స్వామి వారిని కోరుకుంటున్నారు.
#yadagirigutta #yadadri #yadadritemple #yadagiriguttatemple