<> ఈ నెల 31న చలో హైదరాబాద్
<> జర్నలిస్టుల రజతోత్సవ మహా సభ
<> పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్
తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31వ తేదీన హైద్రాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని జల విహార్ అడిటోరియంలో జరిగే రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ అల్లం నారాయణ సార్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ ఆదేశాలతో శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద TUWJ H 143 యూనియన్ సభ్యుుల సమక్షమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులనీ నినదించి తెలంగాణను సాకారం చేసిన ఘనత జర్నలిస్టులకు దక్కిందని టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠ ద్వారం రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టులు తమ వృత్తి ని సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ సాకారం చేశారని చెప్పారు. ఎన్నో కష్టనష్టాలుకు ఓర్చి ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు సరైన గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలలో పాల్గొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనిల్, జిల్లా నాయకులు గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ కళ్లెం సంపత్ గౌడ్, బోధనకు నరేందర్, మాటూరి ప్రభాకర్,బూడిద శ్రీహరి, గోర్ల నవీన్, జేగిని విజయ్, లింగాల సుధాకర్, గుండు రవి, మేకల రాజు,పుట్ట హనుమత్, గుండు మహేందర్, డOగు నరేందర్, బుక్కాల నరేష్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంధమల్ల రాజు, గుజ్జ నరేష్,మొగిలిపాక కనక రాజు, వడ్లకొండ సిద్ధులు, కర్రె గణేష్,
Tags
State News